కార్మిక సమస్యల పరిష్కారానికి ఆగస్టు 3న జరిగే చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి* *డి.కిషన్ సీ
ఇబ్రహీంపట్నం జూలై 28 ప్రజాపాలన ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను సవరించాలని విడుదల చేసిన ఐదు జీవోలను వెంటనే గెజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆగస్టు 3న చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు సిఐటియు తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో "గోడ పత్రిక" విడుదల చేసి, అనంతరం వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి. కిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం పరిధిలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయని వీటిలో సుమారు కోటి మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి ఉందని అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచినా టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కార్మికుల కనీస వేతనాలు సవరించలేదు. కార్మికుల పోరాటాల ఫలితంగా 2021 జూన్ నెలలో ఐదు జీవోలను విడుదల చేసిందనీ కానీ ఆ జీవులను గెజిట్ చేయకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే వాటిని గెజిట్ చేయాలని, మిగిలిన 68 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలు జీవోలను సవరించాలని, బీడీ, హమాలీ, భవన నిర్మాణం, ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులతో పాటు ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా తుర్కయంజాల్ ప్రాంతంలో ఉన్న వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు గాని ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్ధ సౌకర్యాలు కూడా కల్పించే పరిస్థితిలో యాజమాన్యాలు లేవని కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరినీ మార్చుకోక పోగా కార్మిక వ్యతిరేక విధానాలను ఏదేచ్ఛగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 3న సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం జంగయ్య, కొండిగారి శంకర్, పగిళ్ల మధు, నక్మల్ల యాదగిరి, రమేష్, శ్రీశైలం, మహేందర్, నర్సింహారెడ్డి, శేఖర్ రెడ్డి, శంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...