గురప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే కందాళ...

Published: Wednesday December 29, 2021
పాలేరు డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండలం రాజేశ్వపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గురప్ప స్వామి దేవాలయానికి పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, రెండు లక్షల రూపాయలను (2,00,000/-) ఈరోజు నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య, ద్వారా దేవాలయ కమిటీకి అందించారు. ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, నేలకొండపల్లి సర్పంచ్ సంఘం అధ్యక్షులు గండు సతీష్, జిల్లా నాయకులు వజ్జా శ్రీనివాస్ రావు, రెణుబాబు, రాజేశ్వరపురం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దండా రంగయ్య, మండల యూత్ కార్యదర్శి గడ్డమీది సతీష్, జటంగి వెంకన్న, ఎర్ర బోయిన నరసయ్య, జటంగి శ్రీశైలం రెడ్డి, బోన వీరబాబు, ఎర్రబోయిన గంగయ్య, రామారావు, వెంకటేశం గారు తదితరులు పాల్గొన్నారు.