వికారాబాద్ లో కాంగ్రెస్ కు పునఃప్రతిష్ఠ తెస్తాం

Published: Thursday February 11, 2021
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలో పార్టీకి జీవం పోస్తాం
జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జొన్నల రవిశంకర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10 ( ప్రజాపాలన ) : కాంగ్రెస్ పార్టీని జిల్లాలో పునఃప్రతిష్ఠ వచ్చే వరకు అహర్నిశలు కృషి చేస్తామని జిల్లా కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి జొన్నల రవిశంకర్ అన్నారు. బుధవారం ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ ను జిల్లా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలో పార్టీకి జవసత్వాలు పునరుద్ధరిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని గడపగడపకు చేర్చే బాధ్యత మా భుజస్కంధాలపై ఉంటుందని వివరించారు. ప్రతి గ్రామంలో యువతను కాంగ్రెస్ పార్టీ పట్ల చైతన్యం కలిగిస్తామని భరోసా కల్పించారు. పార్టీ శ్రేయస్సే పరమావధిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్, తాండూర్, పరిగి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, బోయ అశోక్ కుమార్, జగన్, పరిగి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ పవార్, రామకృష్ణారెడ్డి, షోయబ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కోలుకుంద సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 
Attachments are