నూతన ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించిన భిషఫ్ సుదర్శనం..

Published: Friday December 02, 2022

తల్లాడ(కల్లూరు), డిసెంబర్ 1 (ప్రజాపాలన న్యూస్): కల్లూరు మండలంలోని సం చండ్రుపట్ల గ్రామంలో నూతనంగా నిర్వహించిన ప్రార్థన చర్చిని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ ఎం. డేవిడ్ సుదర్శనం  ప్రారంభించారు. గ్రామంలో రాష్ట్ర కన్వీనర్ నిరీక్షణరావు ఆధ్వర్యంలో నూతన మందిరాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి సుదర్శనం  ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన దేవుని వాక్యాన్ని ప్రసంగించారు. ప్రతిఒక్కరూ దేవుని ఆలయంలో గడుపుట ఎంతో ధన్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రబాధ్యులు ఆనందరావు, రమేష్ బాబు, ఏసుపాదం, జార్జ్ ముల్లర్, ఖమ్మంజిల్లా అధ్యక్షులు మధుసూదన్, జిల్లా సెక్రెటరీ ప్రేమ్ కుమార్, పలుగ్రామాల పాస్టర్లు, సంఘస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.