లాక్ డౌన్ స్టార్ట్ వైన్స్ షాపులకు గిరాకి
Published: Wednesday May 12, 2021
బాలపూర్, మే11, ప్రజాపాలన ప్రతినిధి : బాలపూర్ మండలం మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా లో ఉన్నటువంటి వైన్ షాప్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ చెప్పిన పది నిమిషాల నుంచి మందుబాబులు, మహిళాలు అధిక సంఖ్యలో ఒకరిమీద ఒకరు నెట్టుకుంటూ మందు బాటిల్స్ ను 4,5 తీసుకొని వెళ్తున్నారు. ఆ గుంపులో ఎవరికి కరోనా మహమ్మారి ఉందో... లేదో.... కరోనా పాజిటివ్ ఉన్నవారు ఎంతమందికి తగ్లిస్తున్నారో.. అందుకే ఈ కరోనా పాజిటివ్ ఇపరిమితమైన కేసులు పెరుగుతున్నాయిని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ, వైన్స్ యజమానులు వచ్చిన మందుబాబులను, మహిళలను భౌతిక దూరం పాటించి మందుబాబులకు బాటిల్స్ ఇవ్వగలరని ప్రజలందరూ వాపోతున్నారు. పోలీస్ సిబ్బంది చెప్పిన గాని మందుబాబులు విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా రోడ్డు మీదకి వచ్చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పారు. వైస్ యజమానులే మందుబాబులకు భౌతిక దూరం పాటించగలరుని ప్రజలందరూ కోరుకుంటున్నట్లు అన్నారు.
Share this on your social network: