క్షౌరశాలల బంద్ సంపూర్ఢం.

Published: Friday February 12, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 11, ప్రజాపాలన: మంచిర్యాల లో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్ కు  వ్యతిరేకంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలల బందుకు తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్య సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం మండల కేంద్రంలో క్షౌరశాలల బంద్ సంపూర్ణంగా కొనసాగింది. గుండాల మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం మండల కమిటీ అధ్యక్షకార్యదర్శులు ఇల్లందుల నర్సింహులు, దడిగల రమేష్ మాట్లాడారు. కార్పొరేట్ సెలూన్ కు వ్యతిరేకంగా తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్య సంఘాల పిలుపుతో క్షౌరశాలల బంద్ పాటించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీను తదితరులు పాల్గొన్నారు.