ప్రజలందరూ చెత్త ఆటోలోనే చెత్తను వేయాలి

Published: Friday November 04, 2022
కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు 
మేడిపల్లి, నవంబర్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) 
రామంతాపూర్ డివిజన్లోని ప్రజలందరూ చెత్త ఆటోలోనే చెత్తను వేసి డివిజన్ ను చెత్తరహిత డివిజన్ గా తీర్చిదిద్దామని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ప్రజలకు సూచించారు. ఈ మేరకు కార్పొరేటర్ డీఈ చందన, ఎస్ ఫ్ఐ లతో కలిసి డివిజన్లోని ఇంద్రానగర్లో ఇంటింటా తిరుగుతూ చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. 
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలందరూ చెత్తను చెత్త ఆటో రిక్షాలలోనే వేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఫ్రీ బిన్ సిటీలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.