గణాంక దర్శినిలో మార్పులు చేర్పుల వివరాలు సమర్పించాలి

Published: Thursday November 03, 2022
జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్
వికారాబాద్ బ్యూరో 02 నవంబర్ ప్రజా పాలన : జిల్లా, మండల గణాంక దర్శిని 2021-22 సంవత్సరానికి గాను శాఖల వారీగా మార్పులు,  చేర్పులతో కూడిన వివరాలను సమర్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి తన చాంబర్ లో ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయ సిబ్బందితో  2021-22 సంవత్సరానికి సంబంధించిన గణాంక దర్శిని రూపొందించడంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ.. గణాంక దర్శిని లో వివిధ పట్టికల సమాచారాన్ని సేకరించడానికి అయన తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.  గణాంక మండల దర్శిని 2021-22 సంవత్సరానికి గాను పశుసంవర్ధక శాఖ,  మత్స్య శాఖకు సంబంధించిన వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. 
ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సి.నిరంజన్ రావు,  జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పి.అనిల్ కుమార్,  మత్స్యశాఖ అధికారి ఎం. చరిత, విజయ డైరీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ లతో పాటు సిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.