రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మూగాల మహేష్ నియామకం

Published: Wednesday September 15, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 14, ప్రజాపాలన : తెలంగాణ బీసీ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంచిర్యాల పట్టణానికి చెందిన మూగాల మహేష్ ను నియమిస్తూ తెలంగాణ బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కె.పి.మురళీకృష్ణ మంగళవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మహేష్ మాట్లాడుతూ తన పై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు కె.పి.మురళి కృష్ణ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో రిజర్వేషన్ల సాధనే ఏకైక లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తుల సుదర్శన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగం గౌడ్ గార్లకు ధన్యవాదాలు తెలిపారు.