మద్యం సేవించి వాహనాలు నడుపోద్దు : ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్
Published: Monday December 13, 2021
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 12, ప్రజాపాలన : మద్యం సేవించి వాహనాలు నడుపద్దని మంచిర్యాల ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 498 మందిని మంచిర్యాల కోర్టులో హాజరుపరచగా కోర్టులో 9,096,000 జరిమానాలు విధించిందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన మనకు జరిగే నష్టంతో పాటు అవతలి వ్యక్తులకు కూడా ప్రమాదకరమని అన్నారు. మద్యం తాగడం వలన వాహన చోదకులు విచక్షణ కోల్పోతారని, డ్రైవింగ్ యందు విషక్షణ కోల్పోయి, వాహనం నియంత్రించలేని పరిస్థితిలో ప్రమాదాలకు గురైతారని అన్నారు
Share this on your social network: