అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీఓ...

Published: Saturday October 09, 2021
సారంగాపూర్, అక్టోబర్ 08 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ ధర్మనాయక్ తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులైన కంపోస్టు షెడ్ పల్లె ప్రకృతివనం వైకుంఠ ధామం తదితర పనులను పరిశీలించిన అనంతరం వాటికి ఎంపీడీఓ వాసల వెంకటేశం చిహ్నం గుర్తులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భూక్య సంతోష్ లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ పాంపర్తి లక్ష్మీ ఎంపీటీసీ ఏలేటి మమత ప్యాక్స్ ఛైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి ఏపీవో రాగేల రాజేందర్ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.