గడ్డం రంజిత్ రెడ్డి మైనారిటీ యూత్ వింగ్ క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Friday January 28, 2022
మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ షకీల్
వికారాబాద్ బ్యూరో 27 జనవరి ప్రజాపాలన : చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సేవలు మరువలేనివని వికారాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ షకీల్ కొనియాడారు. గురువారం హైదరాబాదులోని చేవెళ్ల ఎంపీ స్వగృహంలో గడ్డం రంజిత్ రెడ్డి మైనారిటీ యూత్ వింగ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కోఆప్షన్ మెంబర్ అఫ్జల్ షకీల్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవలో ముందు ఉండడం అభినందనీయమని ప్రశంసించారు. ఏ వ్యక్తికి కష్టం వచ్చినా తానున్నానని భరోసా కల్పించే విశ్వసనీయుడుగా పేరుగాంచాడని కొనియాడారు. ప్రమాదంలో, కష్టకాలంలో, అనారోగ్యంతో కానీ ఉన్న ప్రతి వ్యక్తిని ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం గడ్డం రంజిత్ రెడ్డికే చెల్లిందని స్పష్టం చేశారు. చేవెళ్ల ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కొండంత అండగా ఉంటూ అవసరాలను తీరుస్తున్నాడని చెప్పారు. దయార్ద్రహృదయుడైన మానవతా దృక్పథంతో ఎల్లప్పుడూ ఆదుకుంటున్నాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్, మైనారిటీ సీనియర్ నాయకుడు సిద్దిక్, తాండ్ర ప్రవీణ్, మహమ్మద్ రఫీ, మొహమ్మద్ షఫీ, మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.