అనుమానాస్పద మృతిలో నిందితుడు రిమాండ్

Published: Saturday April 24, 2021
రాయికల్, ఏప్రిల్ 23 (ప్రజాపాలన) : గత నాలుగురోజుల క్రితం పట్టణానికి చెందిన చిక్యాల మహేశ్వరి (22) రాయికల్ పట్టణ శివారులోని ఓ వ్యవసాయ బావిలో మృతి చెందింది. ఈ విషయమై రాయికల్ ఎస్సై ఆరోగ్యం అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతికి ప్రధాన కారణమైన నిందితుడు రాయికల్ కు చెందిన లింగంపెళ్లి రాజేష్ ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల రురల్ సిఐ తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు మహేశ్వరికి మరియు నిందితుడు లింగంపెళ్లి రాజేష్ కు వివాహేతర సంబంధం ఉందని అయితే ఈవిషయంలో తరచు రాజేష్ కు వాళ్ళ భార్యకు గొడవలు అవుతున్నాయని ఆ గొడవల వల్ల సమాజంలో అవమానాలు ఎదురవుతుండడంతో తట్టుకోలేక ఈ అవమానాలకు కారణమైన మృతురాలిని రాజేష్ బావిలో ముంచి చంపినట్లు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించినందున ఎస్సై ఆరోగ్యం ను మరియు సిబ్బందిని సి ఐ కృష్ణకుమార్ అభినందించారు.