ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

Published: Saturday March 20, 2021
వెల్గటూర్, మార్చి 19 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కొక్కిరాల రాజేశ్వర్ రావుకు లక్ష యాబై వేల రూపాయలు, కిషన్ రావు పేట గ్రామానికి చెందిన జలపతిరావుకు లక్ష రూపాయల ముఖ్యమంత్రి సహాయ  నిధి ద్వారా మంజూరి అయిన చెక్కులను కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజున లబ్దిదారులకు  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు. రాజేశ్వరరావు, జగపతిరావు ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు.