బోనాల పండుగలో అమ్మవారిని దర్శించుకున్న శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే

Published: Monday August 02, 2021

పటాన్చేరు, ఆగస్టు 01, ప్రజాపాలన ప్రతినిధి : ఆషాడ మాస బోనాల సందర్భంగా ఆదివారం పటాన్చెరు పట్టణంలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన బోనాల పండగ కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, పట్టణ అద్యక్షులు అఫ్జల్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సీనయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ పరిధిలో బోనాల పండుగ సందర్భంగా రామచంద్రపురం, భారతి నగర్ డివిజన్ పరిధిలోని వివిధ ఆలయాలలో శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్ల సింధు ఆదర్శ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు పరమేష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.