డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

Published: Thursday November 11, 2021
కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్
మేడిపల్లి, నవంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల 3వ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ బుధవారం నాడు కో ఆప్షన్ సభ్యులు రంగా బ్రహ్మన్న గౌడ్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి డివిజన్లోని దత్తాత్రేయ కాలనీలో మిషిన్ భగీరథ మంచినీళ్ళను ప్రారంభించడంతో పాటు శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులు ఆరంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు కొత్త విక్రమ్ గౌడ్, సోమిరెడ్డి, ఆయా కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు