మంచినీటి సమస్యను పరిష్కరించాలని వినతి

Published: Wednesday October 06, 2021
మేడిపల్లి, అక్టోబర్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) : హైదరాబాద్ జలమండలి బోర్డు అధికారుల పనితీరు వల్ల బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు తీవ్ర మంచినీటి సమస్యలు ఎదుర్కొంటుంన్నారని ఖైరతాబాద్ లోని జలమండలి కార్యాలయంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఎండి దానకిశోర్ ను కలిసి నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.