ఆర్టీఐ బ్రతకాలంటే ఆర్టీఐ ని ప్రచారం చేయాలి, వినియోగించాలి పెద్దపల్లి నవంబరు 20ప్రజాపాలన రిప

Published: Monday November 21, 2022
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సిసిఆర్) సంస్థ అధ్యక్షులు మంచికట్ల అనిల్ కుమార్ అధ్యక్షతన  ట్రైనర్ గా ఆర్.టి.ఐ. 2005 చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల వరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ ఆక్ట్) పై అవగాహన మరియు అవినీతి నిర్మూలన, సామాజిక అభివృద్ధి, అలాగే చట్టాలపై అవగాహన కోసం స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించే సరళిని విద్యార్థిని విద్యార్థులకు, కాలేజీ యజమాన్యం మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
తర్వాత ఆర్టీఐ చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై పరీక్ష నిర్వహించి, సిసిఆర్ సంస్థ తరపున వారికి ప్రోత్సాహక పత్రాలు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులకు సిసిఆర్ సంస్థ అధ్యక్షులు పలు సూచనలు చేసారు. సమాజంలో జరుగుతున్న అవినీతి నిర్మూలనకు, సమాజ అభివృద్ధికి, తమ గ్రామ - పట్టణ అభివృద్ధి కోసం సమాచార హక్కు చట్టాన్ని ఎలా ఉపయోగించాలో తెలియజేశారు.
అలాగే సిసిఆర్ సెంట్రల్ కమిటీ సభ్యులు సి హెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం వినియోగించి, తమ చుట్టూ వున్న సమాజం లో జరుగుతున్న అవినీతి  అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలన్నారు.
ఆర్టీఐ ద్వారా సమాచారం రాని పరిస్థితుల్లో కోర్టు అండ్ లీగల్ పరిధి గురించి సిసిఆర్ జోనల్ లీగల్ సెకట్రరీ ఎ. ధీరజ్ విద్యార్థులకు వివరించారు.
సిసిఆర్ పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు గంధం ప్రశాంత్ ఆర్గనైజర్ గా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్. కరుణాకర్, వేముల సూర్య నారాయణ, విద్యార్థిని, విద్యార్థులు, కాలేజీ యజమాన్యం, వివిధ జిల్లాలు - గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.