ఆర్థిక సాయం అందజేత

Published: Wednesday November 24, 2021
యాధాద్రి నవంబర్ 23 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని పులిగిల్ల గ్రామ కేబుల్ టీవీ ఆపరేటర్ వేముల.మల్లేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి యాధాద్రి భువనగిరి జిల్లా కేబుల్ ఆపరేటర్లు అందరూ కలిసి 35,000/- రూపాయలు మంగళవారం వేముల మల్లేశం కుమార్తెల పేరుతో డిపాజిట్ చేసి, ఫిక్స్ డిపాజిట్ బాండ్లు వారి కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షులు బుగ్గ కొమురయ్య, ప్రధాన కార్యదర్శి రచ్చ వెంకటేశ్, మండల అధ్యక్షుడు రచ్చ గణేశ్, కార్యదర్శి గంజి అశోక్, కమిటీ సభ్యులు వడ్డెమాని శ్రీనివాస్, యండి నభీ, యం సత్యనారాయణ, కొలను నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.