గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక జన్నారం, సెప్టెంబర్ 02, ప్రజాపాలన:

Published: Saturday September 03, 2022

గౌడ జన హక్కుల పోరాట సమితి మెాకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరుకల రాజగౌడ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్ గౌడ్ ఆద్వర్యంలో శుక్రవారం జన్నారం మండలం పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోన్కల్ నూతన గౌడ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గౌడ సంఘం కమిటీలో గౌరవ అధ్యక్షుడు గాజుల లింగన్న గౌడ్, అధ్యక్షుడు పోడేటి సతీష్ గౌడ్, ఉపాధ్యక్షుడు బూరగడ్డ శంకర్ గౌడ్, ఎరుకల శంకర్ గౌడ్, బొంగోని లింగాగౌడ్, ప్రధాన కార్యదర్శి కొండ లక్ష్మినారాయణ గౌడ్, ప్రచార కార్యదర్శులు దాసరి రాజేష్ గౌడ్, అమరగొని నాగరాజు గౌడ్, ఎరుకల మహేష్ గౌడ్, దాసరి సతీష్ గౌడ్, కోశాధికారి కోట రవి గౌడ్, సహాయ కార్యదర్శులు కొండ సురేష్ గౌడ్, కోట వినయ్ గౌడ్, ఎరుకల రాజు గౌడ్, ఎరుకల కార్తిక్ గౌడ్, ముఖ్య సలహాదారులు ఏనుగంటి సతీశ్ గౌడ్, బట్టల నర్సాగౌడ్, కైరం బీమగౌడ్, మూల భాస్కర్ గౌడ్, లను  నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడము జరిగింది.