రక్షాబంధన్ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది : కార్పొరేటర్ హరీ శంకర్ రెడ్డి
Published: Monday August 23, 2021
మేడిపల్లి, ఆగస్ట్22 (ప్రజాపాలన ప్రతినిధి) : రక్షాబంధన్ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ హరీ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా డివిజన్లోని సోదరీమణులు, 3వ డివిజన్ కార్పొరేటర్ శారద ఈశ్వర్ రెడ్డి కార్పొరేటర్ హరీ శంకర్ రెడ్డి నివాసంలో ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశంకర్ రెడ్డి మాట్లాడుతూ రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, ప్రభావతి, భూలక్ష్మి, లక్ష్మీ, నళిని, మాధవి, కూతురు హారిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: