సీపీఎం పార్టీ రాష్ట మహాసభలను జయప్రదం చేయండి

Published: Monday January 10, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : ఆదివారం రోజు ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో పోల్కంపల్లి అనుబంధ గ్రామమైన మాన్యగూడ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మహాసభలను జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహిస్తూ ప్రజల నుంచి విరాళాలు సేకరించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు తుర్కయంజాల్ లో జనవరి 22 నుంచి 25 వరకు నర్వహిస్తున్నామని ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైనా చర్చించి భవిష్యత్ ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం పోరాడే సిపిఎం పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మహాసభలు సజావుగా సాగాలని అంటు సీపీఎం పార్టీకి సహకారం అందజేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని ఇదే తరహాలో మరింత సహకారం అందించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సీహెచ్ నర్సింహ్మ, శాఖ కార్యదర్శి వెంకన్న, గ్రామ కమిటీ సభ్యులు గూడెం నర్సింహ్మ, నాయకులు పి.దనేశ్వర్, కె.వెంకటేష్ పి.స్వామి, ఎమ్.చరణ్, కె.ధనంజీ, కే.బాల్ రాజు, ఎమ్ శ్రీకాంత్, జ్యోతిబసు, దయాకర్, తదితరులు పాల్గొన్నారు.