ఘనంగా ముక్కోటి ఏకాదశి

Published: Friday January 14, 2022

ఇబ్రహీంపట్నం, జనవరి 13 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని గోదూర్, తిమ్మాపూర్, ఎద్దండి, ఇబ్రహీంపట్నం, వర్షకొండ కోమటికొండాపూర్, డబ్బా, గ్రామాల్లో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ ద్వారంలో తెల్లవారుజాము సుమారు నాలుగు గంటల నుండి భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరింగంటి దివాకర్ చార్యులు, మధుర అన్వేష్, చార్యులు లక్ష్మణాచార్యులు, రామాచార్యులు, అయ్యప్ప స్వాములు మరియు గ్రామ భక్తులు పాల్గొన్నారు