కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

Published: Tuesday September 20, 2022
ప్రజా పాలన ప్రతినిధి. షాద్నగర్. సెప్టెంబర్ 19. ర్రాజకీయ లబ్ది కోసం తెరాస,బీజేపీ నాటకాలు,,, కాంగ్రెస్ మండల అధ్యక్షడు చలివెంద్రం పల్లి రాజు,,,
తెరాస అధికారం లోకి వచ్చి 8 సంవత్సరాలు దాటిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవం గుర్తించదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షడు చలివెంద్రం పల్లి రాజు విమర్శించారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస,బీజేపీ ల్ల పై అయన విరుచుకుపడ్డారు, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం లో విలీనం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది,సర్దార్ వల్లభాయ్ పటేల్ ది అని అయన పేర్కొన్నారు. విలీనం సమయం లో అడ్రస్ కూడా లేని బీజేపీ ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు,అంతేకాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెరాస పార్టీ కుటుంబ పాలన కొనసాగిస్తూ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఎప్పుడైనా తెలంగాణ ప్రజలకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని వారు పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో అధికారం లోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గ మారుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కొందరు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి,ఎంపిటిసి ల సంఘం అధ్యక్షడు సత్య నారాయణ రెడ్డి,కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షడు వెంకటేశ్వర రెడ్డి నాయకులు ,ఆంజనేయులు,వెంకటేష్,శివకుమార్, జంగయ్య నీలయ్య. యాదయ్య లు పాల్గొన్నారు