తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అద్వర్యం లో అన్నదానం.

Published: Monday July 18, 2022
మంచిర్యాల బ్యూరో, జులై17, ప్రజాపాలన: 
 
మంచిర్యాల జిల్లాలో గత కొన్నిరోజులుగా కురిసిన బారి వర్షాలకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన పద్మశాలి కాలనీ లోని లేబర్ కాలనీలో వరద ముంపుకు గురైన బాధితు లకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆయన  సతీమణి  దాసరి పుష్పలత, కూతురు శ్రీకృతి కాలనీ బాధితులకు ఆదివారం అన్నదానం చేశారు.  వరద బాదితులకు బోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని
  దాసరి పుష్పలత తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ మంచిర్యాల సబ్యులు, జై భీమ్ గ్రూప్స్ మంచిర్యాల సభ్యులు, టి.ఇ.ఏ. మంచిర్యాల ఉపాధ్యక్షులు నాగరాజు, సభ్యులు టి.పి.ఎస్. శ్రీనివాస్, జై భీమ్ మాల మీడియా సబ్యులు  తదితరులు పాల్గొన్నారు.