సనత్ నగర్ లో పారిశుద్ధ్య మహిళా కార్మికులు,అంగన్ వాడిలను సన్మానించిన కార్పొరేటర్ లక్ష్మీ బా

Published: Tuesday March 08, 2022
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : సనత్ నగర్ డివిజన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండోర్ స్టేడియంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాల్ రెడ్డి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి తలసాని ఆదేశాలతో మూడు రోజుల కార్యక్రమాలలో భాగంగా కోవిడ్ సమయంలో సైతం కష్టపడి పనిచేసిన మహిళా పారిశుద్ధ్య కార్మికులను, ఆశా వర్కర్లను సన్మానించుకోవడం మన ధర్మం అన్నారు. దేశంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా గౌరవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే ఆని తెలిపారు. మొదటి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళలందరూ రాఖీలు కట్టగా, రెండవ రోజు మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లాంటి పథకాలతో మహిళలకు ఇంటి  పెద్దన్నగా మారారన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ టి ఆర్ ఎస్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, సరాఫ్ సంతోష్, పురుషోత్తంలతో పాటు పలువురు స్థానిక నాయకులు, మహిళా పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.