మేకల కాపరి ఎస్ కె నాగుల్ మిరా కుటుబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

Published: Wednesday June 23, 2021
బోనకల్లు ప్రజాపాలన ప్రతినిధి 22వ తేదీబోనకల్లు మండల పరిధిలో గోవిందపురం గ్రామానికి చెందిన నాగుల్ మీరా అనే కాపరికి సబందించిన 24 మేకలు ప్రమాదవశాత్తు రైలు కింద పడి చనిపోవడం జరిగింది. ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించిన గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి మేకల నాగేశ్వరరావు అళ్ళపాడు,  గోవిందపురం సర్పంచులు మర్రి తిరుపతిరావు, శ్రీనివాస రావు సంఘo నాయకులు గజ్జి సూర్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ... ఆసరాగా ఉన్న మేకలు ప్రమాదవాత్తూ మృతి చెందడంతో ఆ కుటుబం తీవ్రంగానష్టపోయిందని, నగుల్ మీరా కుటుంబానికి ప్రభుత్వమే సాయం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు లక్షల రూపాయలు నష్టం  వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడి నివేదికను ప్రభుత్వానికి పంపించేలా చర్చించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.