వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలన్న రాగిడి లక్ష్మారెడ్డి

Published: Thursday April 13, 2023
మేడిపల్లి ఏప్రిల్ 12 (ప్రజాపాలన ప్రతినిధి)
 రామంతాపూర్ డివిజన్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా  ఏర్పాటు చేసే చలివేంద్రాన్ని మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.  అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉప్పల్ నియోజకవర్గంలో చేపడుతూ మరి ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తామని, అలాగే ఉచిత మెడికల్ క్యాంపులు, ఉచితంగా మందుల పంపిణీ, మహిళా సాధికారతే లక్ష్యంగా ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, కంప్యూటర్ డిజైనింగ్ లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వర్కర్లు , మరియు నిరుద్యోగులకు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ కల్పన కల్పించడం, వికలాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేస్తూ, ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పై చదువులు చదువుకోవడానికి విదేశాలు వెళ్లే వారికి చేయూతనిస్తూ వారికి అండగా ఉంటామని  తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు వినోద్ ముదిరాజ్, పలకల నరసింహారెడ్డి, వంజరి సంతోష్, భాను గౌడ్, సాయి గౌడ్, సాయిబాబా, నరేష్,  గజ్జల రాజు, శ్రావణ్ కుమార్, మల్లేష్ యాదవ్, రాఘవ, నవీన్, ఆకాష్, దాసరి సురేష్ ప్రవీణ్, పవన్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.