పోడు భూములను సర్వే చేస్తున్న సెక్రటరీ వేణు..

Published: Tuesday October 18, 2022
తల్లాడ, అక్టోబర్ 17 (ప్రజాపాలన న్యూస్): 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములను సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో రైతుల పోడు భూములను గ్రామ సెక్రెటరీ వేణు సర్వే చేస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న రైతుల భూములు అధికంగా గోపాలపేట, వెంకటగిరి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఉండటంతో అక్కడికి వెళ్లి రైతుల భూములను సర్వే చేస్తున్నారు. ఎవరెవరికి ఎంత భూమి ఉందనే దానిపై సర్వే చేపట్టి వివరాలను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నారు. గత వారం రోజుల నుండి ఈ భూసర్వే కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ పంచాయతీ సిబ్బంది, పోడు రైతులు ఉన్నారు.