నేడు డయల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమం
Published: Monday August 23, 2021
వికారాబాద్ బ్యూరో 22 ఆగస్ట్ ప్రజాపాలన : సోమవారం ఉదయం 9:30 నుండి 10:30 వరకు "డయల్ ఇన్ గ్రీవెన్స్" కార్యక్రమంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం 08416256989 నెంబర్ కు కాల్ చేసి తమ సమస్యలు తెలపాలని కోరారు. అన్ని శాఖల అధికారులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు పరిష్కరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Share this on your social network: