కీర్తి కుమార్ ఉన్నత చదువులకు ఆర్థిక చేయూత

Published: Tuesday October 12, 2021
 బోనకల్, ప్రజాపాలన ప్రతినిధి, అక్టోబర్ 11 : దళిత గిరిజన బహుజన సాధికారత సంస్థ ఆధ్వర్యంలో కీర్తి కుమార్ ఉన్నత చదువులకు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం పుల్లయ్య పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి నాడు. ఈ కార్యక్రమాన్ని స్థానిక బోనకల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్  రాధిక  మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి కిషోర్, బీజేపీ యువ నేత బీ పీ నాయక్, మరియు యూత్ కాంగ్రెస్ నేత  భూక్యా భద్రు నాయక్ స్థానిక అధికారుల చేతుల మీదుగా కీర్తీ కుమార్ కు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ కిర్గిస్తన్ లో విద్య ను అభ్యసిస్తున్న కీర్తి కుమార్ ను అభినందించి నా వంతుగా తప్పకుండా ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీపీ నాయక్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కు ఆర్థిక చేయూత ను ప్రతి ఒక్కరూ అందించాలని నా బాధ్యతగా కీర్తి కుమార్ చదువుకు సహాయం అందిస్తామని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.