అధికారులు వేదించడం అపాలి తాహసిల్థార్ వినతి పత్రం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా
Published: Wednesday June 08, 2022
జన్నారం రూరల్, జున్ 07, ప్రజాపాలన: అటవీశాఖ అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను వేదించడం అపాలని ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు డిమాండ్ చేశారు, ఈ మేరకు మంగళవారం స్థానిక తాహసిల్థార్ ఇటాల కిషన్ వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా చేట్లా రమేష్ మాట్లాడుతూ పారెస్టు అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు లను వేదిస్తున్నారని వాస్తవాలు రాస్తే టైగర్ జోన్ నిబంధనల పేరిట ప్రజాస్వామ్యంలో కీలకమైన మీడియా గొంతు నొక్కాలని చూడటం తగదని అయన అన్నారు, జర్నలిస్టులపై కొనసాగిస్తున్న నోటీసులు, కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ అధ్యక్షులు చెట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్ స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కందుల రమేష్, ప్రదాన కార్యదర్శి నిజాం, సినియార్ జర్నలిస్టులు ముస్తాఫా, తాటి శ్రీనివాస్, అబినయ్, పారువెల్లి శ్రీనివాస్, ఎర్రం తిరుపతి, కొండపల్లి ప్రశాంత్, పలువురు అఖిల పక్ష నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: