గిరిజనులకి 10% రిజర్వేషన్ మరియు గిరిజన బంద్.. సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన పినపాక ఎమ్మెల

Published: Monday September 19, 2022
ఈరోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో  సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు, మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత గారు మరియు, పలువురు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు...
 
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ,
 
సీఎం కేసీఆర్ గారు గిరిజన రిజర్వేషన్ల కోసం తీసుకున్న నిర్ణయం హర్షిణియం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు గారు గిరిజన రిజర్వేషన్ 10% శాతం పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు , దీంతో కేసీఆర్ కు పేరు వస్తుందని ఆలోచించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొక్కి పెట్టింది, బిజెపి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న దాన్ని భావించిన సీఎం కేసీఆర్ గారు రిజర్వేషన్లు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు, దళిత బంధు మాదిరిగా పేద గిరిజనుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజన బంధు పథకాన్ని ప్రకటించడం సంతోషకరమన్నారు, గిరిజనులు ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న కలలను సీఎం కేసీఆర్ ప్రకటనలతో సహకారమైంది ఈ పథకం గిరిజన జీవితాలలో వెలుగులు నింపునున్నది, ఉమ్మడి రాష్ట్ర పాలకులు కారణంగా గిరిజనలు ఇబ్బందుపడ్డారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజన బందును ప్రకటించడం సంతోషంగా ఉంది గిరిజన బాంధవుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్ గారి గిరిజన సంక్షేమలకు పెద్దపీట వేస్తున్నారు అడవి భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆకుపత్రలు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు రైతు బంధు రైతు బీమా ఐటీడీఏ పథకాలు గిరిజనలకు ప్రయోజనంగా చేకూరుతున్నాయని అన్నారు...
 
పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఆదివాసి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, టిఆర్ఎస్ పార్టీ ఆదివాసి నాయకులు  వారు మాట్లాడుతూ...
 
గిరిజనలు ఉపాధి మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్ గారు గిరిజన బంధు పథకం అమలు చేయడం చారిత్రకమైంది, గత ప్రభుత్వాలు గిరిజనులను ఏమాత్రం పట్టించుకోలేదు దీంతో జిల్లాలోని గిరిజనులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు, తాజాగా హైదరాబాదులోని గిరిజన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించడం సంతోషదాయకమన్నారు...
 
 ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఆదివాసి నాయకులు వట్టం రాంబాబు, ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు పోలబోయిన అనిల్ కుమార్, ఉపాధ్యాయులు పడిగా అంజయ్య, పారిజాతం శ్రీను, తదితరులు ఉన్నారు...