ఆటో ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులకు గాయాలు

Published: Tuesday December 13, 2022
బోనకల్, డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: ఆటో ప్రమాదంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసులకు గాయాలైన సంఘటన మండల పరిధిలోని రాపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఫంక్షన్ నిమిత్తం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి కు ఆటో లో ప్రయాణిస్తుండగా మండల పరిధిలో రాపల్లి గ్రామం దగ్గర ఆటో ప్రమాదవశాత్తు క్రింద పడి ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయాలైన వారిలో కుక్కల మరియమ్మ(45) కుడి చేయి విరిగింది.అంబోజి భాగ్యమ్మ (45)తలకు గాయాలయి వెన్ను నొప్పి పట్టింది. మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణించిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలకు ఏమి కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 సిబ్బంది సమాచారం అందించగానే సిబ్బంది కోట భాను సహాన్, కాలసాని వెంకట్రావు ప్రథమ చికిత్స అందించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.