ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
Published: Wednesday June 30, 2021
మధిర, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధి ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి మండల కార్యదర్శిలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను, కాంపౌండర్, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మరియు రోజువారీ కోడు వ్యాక్సిన్ పరిమితిని 1000 వరకు పెంచాలని, వేయిపడగలు గదిని వెంటనే నిర్మించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మధిర ప్రభుత్వ ఆసుపత్రి నందు కనీస వసతులు గాని అత్యవసర మందులు గాని లేవని. వాటిని ప్రభుత్వాసుపత్రి లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరినారు.. ఈ ధర్నాలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు, మండల కార్యదర్శి మందా సైదులు. నాయకులు పడకంటి. మురళి, కృష్ణారావు. SFI జిల్లా అధ్యక్షుడు మధు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్. తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు
Share this on your social network: