ఓటును ఆధార్ లింక్ చేయాలని సమీక్షా సమావేశం

Published: Tuesday September 06, 2022

రాయికల్, సెప్టెంబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి): ఓటును ఆధార్ లింక్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాయికల్ మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్ బూతులెవెల్ ఆఫీసర్స్,అంగన్వాడి టీచర్లు,మెప్మా ఆర్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటుకి ఆధార్ లింకు చేయాలని, 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారిని నూతనంగా ఓటరు నమోదు చేర్చడం, చనిపోయిన వారిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం,పేరు పోలింగ్ (బూతు) స్టేషన్ మార్పు తదితర అంశాలపై మహిళా సంఘాలతో కలిసి పనిచేయాలని అంగన్వాడీ టీచర్లు, బూతులెవల్ ఆఫీసర్స్, ఆర్పీలకు సూచించారు. సమావేశంలో మండల సూపరిండెంట్ రాయికల్ మునిసిపల్ మేనేజర్ వెంకటి పాల్గొన్నారు.