వైకుంఠ దామ అభివృద్ధి పనులను పరివేక్షించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday June 15, 2021
మేడిపల్లి, జూన్ 14, (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠ దామ అభివృద్ధి పనులను కమిషనర్ శ్రీనివాస్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా రూ 2 కోట్ల నిధులు మంజూరు చేయుంచుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠ దామ పనులను నిరంతరం పరివేక్షించాలని మేయర్ జక్క వెంకట్ రెడ్డి మున్సిపల్ డిఈ శ్రీనివాస్ కు సూచించారు. ప్రత్యేకంగా వర్క్ ఇన్స్పెక్టర్ ని పరివేక్షించడానికి నియమించాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ జక్కా వెంకట్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ వినీల్ మరియు కాంట్రాక్టర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.