చక్రంపల్లి గ్రామంలో మిషన్ భగీరథ లీకేజీల మరమ్మతులు

Published: Friday November 26, 2021
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజాపాలన : చక్రంపల్లి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి మీతో నేను కార్యక్రమం ఉత్ప్రేరకంగా పని చేస్తుందని గ్రామ సర్పంచ్ వసంత గోవింద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మోమిన్పేట్ మండల పరిధిలోని చక్రంపల్లి గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమాన్ని సాయంకాలం నిర్వహించారు. ప్రజా క్షేత్రంలోని సమస్యలు తెలుసుకొనుటకు ఎమ్మెల్యే స్వయంగా చక్రంపల్లి గ్రామ సర్పంచ్ వసంత గోవింద్ రెడ్డి తో కలిసి వీధి వీధి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో చక్రంపల్లి గ్రామంలో సమస్యల పుట్టను గ్రామ ప్రజలు ఏకరువు పెట్టారు. సావధానంగా విన్న ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా ఫోన్ చేసి సమస్య తీవ్రతను అధికారులు, ప్రజల మక్షంలో లౌడ్ స్పీకర్ ఆన్ ఆన్ చేసి వినిపించారు. సమస్యల తీవ్రతను గుర్తించిన సంబంధిత అధికారులు వెనువెంటనే పరిష్కారం దిశగా వేగంగా అడుగులు వేసి సమస్యను పరిష్కరించడం మీతో నేను కార్యక్రమం మేల్కొల్పింది.