ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో ఘనంగా దసరా ఉత్సవాలు

Published: Friday October 07, 2022
మేడిపల్లి, అక్టోబర్6 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో దసరా ఉత్సవాలను ఉత్సవ సమితి  వ్యవస్థాపక అధ్యక్షులు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ,కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఉప్పల్ పట్టణంలో దసరా ఉత్సవాలకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జమ్మి పూజ,పాలపిట్ట దర్శనం, రావణ దహనం తదితర కార్యక్రమాలను అతిథుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య సలహాదారుడు పాశికంటి నాగరాజు, అధ్యక్షులు పాలడుగు లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి గొరిగే మహేష్, ఉపాధ్యక్షులు మహంకాళి రాజు,,మరియు విశిష్ట అతిథులుగా పుర ప్రముఖులు దుబ్బ నరసింహారెడ్డి, కందికంటి అశోక్ గౌడ్, సల్ల రాజిరెడ్డి, జనుంపల్లె వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవికుమార్, బోరంపేట కృష్ణ, పోగుల దయాకర్ రెడ్డి, బజార్ జగన్నాథ్ గౌడ్,బాకారం లక్ష్మణ్ ,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి ,తెల్కల మోహన్ రెడ్డి ,బిక్కుమళ్ల అంజయ్య గుప్తా ,తొఫిక్ ,ఈగ అంజయ్య, చెర్ల సుధాకర్ రెడ్డి,గొరిగే ఐలయ్య, సుధాకర్ శెట్టి,వసునూరి ప్రకాశ్ రెడ్డి, సుధాకర్, అలీం,మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.