ఆటో అదుపు తప్పి బోల్తాపడగా డ్రైవర్ మృతి శంకరపట్నం ఫిబ్రవరి 15 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Thursday February 16, 2023

శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామ శివారులో మంగళవారం రాత్రి ఆటో అదుపు తప్పి బోల్తా పడగా వీణవంక మండలం మల్లన్న పల్లె గ్రామానికి చెందిన  ఆటో డ్రైవర్ నామిని చంద్రయ్య తీవ్ర  గాయాలయ్యాయి.  స్థానికుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా హుటాహుటి నా సంఘటన స్థలాన్ని చేరుకున్న అతని భార్య చంద్రయ్యను చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరిపోయినసానికే చనిపోయి ఉన్నాడని డాక్టర్లు దృవీకరించారు. మృతుడి భార్య నామిని సునీత తెలిపిన వివరాల ప్రకారం  పద్మశాలి కులానికి చెందిన తన భర్త నామిని చంద్రయ్య  ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనాన్ని సాగిస్తుండేవాడు. అయితే మంగళవారం రోజున తన ఇద్దరు స్నేహితులతో కలిసి  ఆటో కొనుగోలు విషయమై కరీంనగర్ కు వెళ్లిన  చంద్రయ్య తిరిగి ఇంటికి వస్తుండగా రాత్రి వేళలో ఆటో అదుపు తప్పి ఈ దుర్ఘటన జరిగినట్టు బుధవారం కేశవపట్నం పోలీస్ స్టేషన్లో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఫిర్యాదు మేరకు ఎస్సై దేశ్ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.