ప్రశాంత్ నగర్ కాలనీ ముఖద్వారంను ప్రారంభించిన కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్

Published: Monday March 14, 2022
మేడిపల్లి, మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ ప్రశాంత్ నగర్లో కాలనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో కొత్త ప్రభాకర్ గౌడ్ సహకారంతో ఏర్పాటుచేసిన కాలనీ ముఖద్వారంను స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ దాత కొత్త ప్రభాకర్ గౌడ్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీ ప్రతినిధులు కాలనీ లోని సమస్యలను కార్పొరేటర్ చందర్ గౌడ్ దృష్టికి తీసుకురాగా స్పందించిన కార్పొరేటర్ కాలనీలో నెలకొన్న సమస్యలన్నింటిని దశలవారీగా పూర్తి చేస్తూ, ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ప్రశాంత్ నగర్ కాలనీ ప్రతినిధులు కాలనీ సమస్యల విషయంలో ముందంజలో ఉండి సమస్యలన్నింటిని నెరవేర్చు కుంటున్నారని కాలనీ ప్రతినిధులను కార్పొరేటర్ చందర్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు రంగ బ్రాహ్మన్న గౌడ్, చెంగిచెర్ల మాజీ వార్డు సభ్యులు కుర్రి శివ శంకర్, టీఆర్ఎస్ యువజన నేత కొత్త విక్రమ్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు చిర్కా మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి చిర్ర శ్రీధర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు రాంచందర్ నాయక్, సలహాదారుడు వంటేరు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు లకావత్ వెంకన్న, కోశాధికారి విష్ణుమూర్తి, జాయింట్ సెక్రటరీ లు అల్లాడి రమేష్, జ ప్రదీప్ కుమార్, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ నాయక్ దుప్పటి వెంకన్న, ప్రభాకర్ రెడ్డి రామ్ చందర్, సభ్యులు బాల్రాజ్ గౌడ్, చంద్రకాంత్ రెడ్డి, అనిల్ రెడ్డి మధుసూదన్ రావు, దేవదాస్, ఉమామహేశ్వర రావు, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.