*జ్యోతిరావు పూలే దేశానికి చేసిన సేవలు మరువలేనివి* చేవెళ్ల నియోజకవర్గం: ప్రజాపాలన :

Published: Tuesday November 29, 2022
మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలను, ఆలోచనలను నేటి యువత సాకారం చేయాలని  చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సున్నపు ప్రవీణ్ అన్నారు. చేవెళ్ల మండల కేంద్రం లో సోమవారం నాడు  మహాత్మా జ్యోతిరావు పూలే  వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....మహాత్మా జ్యోతిరావు పూలే మరువలేని గొప్ప సంఘసంస్కర్తని, జ్యోతిరావు పూలే దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. మహిళల విద్య కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా  గుర్తుచేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే జీవితాంతం పోరాటం చేశారన్నారు. పూలే కలలు కన్న రాజ్యం రావాలంటే ప్రజలంతా చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు కోసం పూలే చేసిన త్యాగాలను నేటి తరానికి వివరించాలని  సూచించారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు బురాన్ విఠలయ్య, మద్దెల జంగయ్య, దామరగిద్ద అంబేద్కర్ సంఘం  అధ్యక్షులు మాచనపల్లి రామస్వామి,ఆలిండియా అంబేద్కర్ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బ్యాగరి ప్రభాకర్, సమత సైనిక్ దళ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏర్పుల మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తలారి శ్రీనివాస్, ఆలిండియా అంబేద్కర్ సంఘం చేవెళ్ల  మండల ఉపాధ్యక్షుడు మల్లెపల్లి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.