బిఆర్ఎస్ పార్టీ నుండి సిపిఎం పార్టీలో చేరిక

Published: Saturday October 08, 2022
బోనకల్, అక్టోబర్ ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామంలో సిపిఎం పార్టీలోకి కుక్కల పుల్లయ్య వారి కుటుంబ సభ్యులు శుక్రవారం సిపిఎం సీనియర్ నాయకులు సహకార సంఘం అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు ఉమ్మనేని రవి, సిపిఎం సీనియర్ నాయకులు గ్రామ ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, వల్లంకొండ సురేష్ సిపిఎం శాఖ కార్యదర్శిలు నల్లమోతు వాణి, వార్డ్ మెంబర్ పొన్నం రాంబాబు, సమక్షంలో శుక్రవారం పార్టీ కండవాలు కప్పి సిపిఎం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గోవిందపురం గ్రామంలో సిపిఎం పార్టీ నిరంతరం పేదల సమస్యలకు పరిష్కారం కోసం నీతిగా నిజాయితీగా పనిచేస్తుందనీ, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నారనీ అన్నారు. అనంతరం సిపిఎం పార్టీలో చేరిన కుక్కల పుల్లయ్య మాట్లాడుతూ సిపిఎం చేసే పోరాటాలకు ఆకర్షణైనానని నీతిగా నిజాయితీగా పనిచేస్తుందని గ్రహించి నేను మా కుటుంబ సభ్యులు అందరం కలిసి సిపిఎం పార్టీలో చేరడం జరిగిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కళ్యాణపు కళ్యాణపు శ్రీనివాసరావు, కళ్యాణపు బుచ్చయ్య, పుచ్చకాయల వలరాజు, మంద మదర్, కన్నె పోగు వెంకటేష్, మర్రి వెంకటేష్ ,డివైఎఫ్ఐ మాజీ నాయకులు తమ్మారపు లక్ష్మణ్, కొత్తపల్లి రమేష్, నల్లమోతు నాగేశ్వరరావు , ఏసుపోగు బాబు, కన్నెపొగు బాబు, మంద రూబేను తదితరులు పాల్గొన్నారు.