పల్లె ప్రగతి లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి

Published: Monday July 05, 2021
పరిగి, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం సర్పంచ్ రాజిరెడ్డి వార్డ్ సభ్యులు గ్రామస్తులు అంగన్వాడీ మహిళా సంఘాల వారితో కలిసి శ్రమదానం చేసారు. పరిసరాలను శుభ్రం చేయించి, ప్రతి వ్యక్తి పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. తడి పొడి చెత్త పై ఇంటింటికెళ్లి అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్, ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, గ్రంథలయ శాఖ డైరెక్టర్ యాదయ్య గౌడ్, వార్డ్ సభ్యులు లక్ష్మణ్, వసంతరావు, మైను, అంగన్వాడీ టీచర్స్, మహిళా సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.