లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేసిన డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్

Published: Tuesday July 27, 2021
మేడిపల్లి, జూలై 26 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలో భాగంగా సోమవారం మేడిపల్లి లోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నగర డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేశారని తెలిపారు. ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బచ్చా రాజు, కో ఆప్షన్ సభ్యుడు బొడిగె రాందాస్ గౌడ్, నాయకులు పాశం బుచ్చి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.