తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మత రాజకీయం మానుకోవాలి యాచారం మండల కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ టిఆ

Published: Tuesday July 05, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి 

దేశంలోని దొంగలందరిని తీసుకొచ్చి బిజెపి పార్టీ తెలంగాణలో ఎన్ని ఎత్తులు జిత్తులు వేసిన మత రాజకీయాలకు ఈ గడ్డపై చోటు లేదని స్వరూప హెచ్చరించారు
ప్రభుత్వ ఆస్తులు సంపదనుఅమ్మే  దొంగల దండుకు స్వాగతం పలకడం అంటేతెలంగాణ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టడమే అన్నారు.
అధికారంలోకి రావడం అనేది బిజెపి పార్టీ పగటి కలగా భావించాలి.
ఇక్కడ వున్నది  కెసిఆర్ అని మరిచి పోతున్నారా.
మోడీ గారి తాత నైజాం నవాబు లాంటి వారికి గోరిగట్టిన  తెలంగాణ గడ్డ ఇది
ఉత్తరాది రాష్ట్రాలలో మీ పరిపాలన సాధించిన ఘనత ఏమిటో తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ని చూసి నేర్చుకోవాలని హితవుపలికారు.
ప్రభుత్వ పథకాలలో మేటిగా నిచ్చిన తెలంగాణ ప్రభుత్వంనిలిచిన తెలంగాణ ప్రభుత్వం నేటికీ ప్రజాధరణ ఉంది అదే బిజెపి పార్టీకి ఏ విధంగా ఉందో రాబోయే ఎన్నికల్లో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేసి మోడీ ప్రభుత్వాన్ని పూలదల చేయడం  కెసిఆర్ కే సాధ్యమని  కొనియాడారు.