ప్రజల సహకారంతోనే డివిజన్ అభివృద్ధి సాధ్యం

Published: Saturday July 03, 2021
కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్
మేడిపల్లి, జూలై 2 (ప్రజాపాలన ప్రతినిధి) : డివిజన్లోని ప్రజల సహకారంతోనే డివిజన్ అభివృద్ధి సాధ్యమని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ పేర్కొన్నారు. 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమ్య సతీష్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్లో పట్టణ ప్రగతి పదిరోజులు చేయాల్సిన పనుల కార్యాచరణ ప్రకటించారు.  రోడ్డు ఇరుపక్కన మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించడం, ఒపెన్ ప్లాట్స్ లో పేరుకున్న చెత్తను శుభ్రపరచడం , మురుగునీరు నిలవకుండా, దోమలను నివారించే విధంగా చూసుకోవాలని, డ్రైనేజ్ సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కరించడం చేయడం, వంపులను గుర్తించ ఈ వర్షాకాలంలో నీళ్ళునిలవకుండా చేయడం, చెట్లకొమ్మలు తగలకుండా విద్యుత్ వైర్లను సరిచేసుకోవడం, లోవోల్టాగే రాకుండా ట్రాన్స్ వారములు ఏర్పరచుకోవడం, మంచినీటి వ్యవస్థను సరిచూసుకోవడం లాంటి అభివృద్ది పనులను చేసుకోవాలని తెలిపారు. వంతు బాధ్యతగా డివిజన్ కమిటి సభ్యులు తప్పనిసరిగా సమయం కేటాయించాలని కార్పొరేటర్ కోరారు.