27 వ డివిజన్ లో బిజెపి 41 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Published: Wednesday April 07, 2021
బాలాపూర్, ఏప్రిల్ 06, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఉన్న వచ్చే 2023వ సంవత్సరంలో బిజెపి అధికారంలోకి వస్తామని  ధీమా వ్యక్తం చేసిన  స్థానిక కార్పొరేటర్ పేర్కొన్నారు. బాలాపూర్ మండలం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు స్థానిక కార్పొరేటర్ భాజపా పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి మాట్లాడుతూ..... కేంద్రంలోని గతంలో  2 ఎంపీ సీట్లు ఉన్న  సందర్భంలో ప్రజలే తీర్పనిచ్చించారు. ఇప్పుడు 303 సీట్లతో అధికారంలో ఉన్నామన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే సీట్లు 2 ఉన్నప్పటికీ వచ్చే 2023 వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా జెండా ఎగుర వేస్తాము అని ముక్తకంఠంతో అన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ భాజపా వైపు చూస్తున్నారని. ప్రతి ఒక్కరు  అధికారంలోకి రావడానికి ఒక సైనికుడిలా పనిచేయాలని తెలియజేశారు. తెలంగాణ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర హరినాథ్ రెడ్డి, కీసర కృష్ణారెడ్డి, భీమ్ రాజ్ సోమేశ్వర్, సూల ప్రభాకర్, బొజ్జ పరమేష్, అడ్వకేట్ శ్రీకాంత్ శ్యామ్ కుమార్, ఓబీసీ కార్యాలయం కోట్ల గోపాల్ రెడ్డి , శివ కుమార్ చారి, దేవానంద్, మధు, బాల చారి, రాము, మహేష్, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.