వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
Published: Thursday July 22, 2021
మేడిపల్లి, జూలై 21 (ప్రజాపాలన ప్రతినిధి) : వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వరద ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామంతాపూర్ పెద్ద చెరువు నిండుకుండలా నిండిపోయింది. ఈ మేరకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి చెరువును సందర్శించి చెరువులోకి వచ్చిన వరద ప్రవాహాన్ని మోటర్ ద్వారా బయటికి పంపించేందుకు ఏర్పాటు చేసిన మోటార్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు కంచర్ల సోమిరెడ్డి, వెల్లంకి రవీందర్ రెడ్డి, బాల వెంకట్, పీ. నగేష్, సోలిపురం జయచంద్ర రెడ్డి, పరమేశ్వర చారి, ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, సూరం శంకర్ జెసిబి రాజు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: