వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

Published: Thursday July 22, 2021
మేడిపల్లి, జూలై 21 (ప్రజాపాలన ప్రతినిధి) : వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వరద ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామంతాపూర్ పెద్ద చెరువు నిండుకుండలా నిండిపోయింది. ఈ మేరకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి చెరువును సందర్శించి చెరువులోకి వచ్చిన వరద ప్రవాహాన్ని మోటర్ ద్వారా బయటికి పంపించేందుకు ఏర్పాటు చేసిన మోటార్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు కంచర్ల సోమిరెడ్డి, వెల్లంకి రవీందర్ రెడ్డి, బాల వెంకట్, పీ. నగేష్, సోలిపురం జయచంద్ర రెడ్డి, పరమేశ్వర చారి, ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, సూరం శంకర్ జెసిబి రాజు తదితరులు పాల్గొన్నారు.