మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు

Published: Monday February 20, 2023

కోరుట్ల,ఫిబ్రవరి 18 ( ప్రజాపాలన ప్రతినిధి):
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం రోజున కోరుట్ల పట్టణంలోని రామేశ్వర ఆలయాన్ని, మహాదేవ  స్వామి ఆలయాన్ని మండలంలోని సంగేమ్ గ్రామంలో సంగమేశ్వర ఆలయాన్ని  సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని జువ్వాడి  క్రిష్ణారావు  ఆ దేవదేవున్ని ప్రార్థించారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్  అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ సహాయ కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ, వై  రాంచందర్ రావు, పోతుగంటి శంకర్ గౌడ్, బన్న రాజేష్, ముంజరాజం ,ఎస్.రాజం, వెంకగౌడ్, తదితరులు పాల్గొన్నారు.