మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు
Published: Monday February 20, 2023
కోరుట్ల,ఫిబ్రవరి 18 ( ప్రజాపాలన ప్రతినిధి):
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం రోజున కోరుట్ల పట్టణంలోని రామేశ్వర ఆలయాన్ని, మహాదేవ స్వామి ఆలయాన్ని మండలంలోని సంగేమ్ గ్రామంలో సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని జువ్వాడి క్రిష్ణారావు ఆ దేవదేవున్ని ప్రార్థించారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ సహాయ కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ, వై రాంచందర్ రావు, పోతుగంటి శంకర్ గౌడ్, బన్న రాజేష్, ముంజరాజం ,ఎస్.రాజం, వెంకగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: